మనం ఏదైనా తప్పు చేస్తే దేవుడు తప్పకుండ శిక్షిస్తాడంట .....అని ఎప్పుడు మా అమ్మమ్మ చినప్పుడు చెప్తూ వుండేది.అప్పుడు తెలిసి తెలియని age లో , ప్రపంచం లో ఇంత మంది వుంటారు కదా ,అందర్నీ దేవుడు ఎలా చూస్తూ ఉంటాడు అని ఒక వెర్రి question అడిగేదాన్ని ......
అప్పట్లూ నాకో ఆలోచన కూడా వుండేది ..... దేవుడు నిద్ర పోఎపుడు మాత్రం ఎవరు ఎన్ని తప్పులు చేసిన పర్లేదు అనమాట అనుకునే దాని .....అందుకే ఇంట్లో ఏదైనా తినేవి అడగకుండా తీస్కోవాలి అంటే,దేవుడు ఫోటో లు లేని చోటు చూసి అక్కడవి మాత్రమే తీస్కోనేదాన్ని(ఎందుకంటే నేను చేసేది తప్పు అని తెలిసిన , స్వీట్స్ తినాలి కాబట్టి దేవుడు చూడకుండా చేసేదాన్ని ) ....
ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం కదా ...అసలు విషయం ఇప్పుడు అర్ధం అయింది ,దేవుడు అన్ని చూడలేదు కదా పాపం ,అందుకే మనకి మనసాక్షి అనేదాన్ని ఇచాడు ...కనీసం దేవుడైన పోనిలే పాపం పిల్ల అని ఏదైనా వోదిలేస్తాదేమో కాని,మన మనసాక్షి మాత్రం నిద్ర కూడా పోదు , ఏదైనా తప్పు చేస్తే ,నువ్వు తప్పు చేసావ్,అల ఎలా చేస్తావ్ అసలు ,అంటూ ఎప్పుడు ఏదో ఒకటి తిడుతూ ,అది నిద్రపోదు మనల్ని నిద్రపోనివదు ......
అమ్మో దేవుడికి ఎన్ని తెలివితేటలో చూడండి ..... అందుకే దేవుడయదేమూ !!!